చిక్కడపల్లి, జూన్ 29 : దళితుల జీవితాల్లో మార్పు తీసుకరావడానికి సీఎం కేసీఆర్ రూ. 1200 కోట్లతో దళిత సాధికారత పథకం అమలు చేయడం హర్షణీయం అని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. మంగళవారం రాంనగర్ డివిజన్లోని శ్రీరాంనగర్ బస్తీలో బస్తీ అధ్యక్షుడు ఆర్.వివేక్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏడేండ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళితుల కోసం రూ. 55 వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో వంద కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించి వారి అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో టీఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహ బస్తీ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, వైస్ చైర్మన్ దానయ్య, ప్రధాన కార్యదర్శి హరికృష్ణ, కోశాధికారి ప్రేమ్, ఉపాధ్యక్షుడు రూపుల జయదేవ్, ఆనంద్, శివకుమార్, ప్రేమ్, నరేశ్, సుధాకర్, రమేశ్, టీఆర్ఎస్ నాయకులు ముచ్చకుర్తి ప్రభాకర్, ముఠా శివసింహ,ఎంవీ జనార్దన్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాంనగర్ డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సత్యనారాయణ, రాజు ఆధ్వర్యంలో సుందరయ్య పార్కు వద్ద సీఎం కేసీఆర్ చిత్ర పటానికి ఎమ్మెల్యే హాజరై క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, ఆర్.మోజస్, డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.వివేక్, కిరణ్కుమార్,బబ్లు, జైదేవ్, దామోదర్రెడ్డి, ఎర్రం శేకర్, నాగభూషణం, కూరగాయల శ్రీను, సాయి తదితరులు పాల్గొన్నారు.