న్యూఢిల్లీ : ఆదివాసీలు, రైతు బిడ్డలు, మహిళలు, దళితులు .. కేంద్ర మంత్రులయ్యారని, అయితే వారి పరిచయాన్ని అడ్డుకోవడం శోచనీయమని ప్రధాని మోదీ అన్నారు. ఇవాళ రాజ్యసభలో ఆయన మాట్లాడారు. రైడు బిడ్డల్ని సభలో పరిచయం చేసే శుభసందర్భం ఇదని, కానీ కొందరు సభ్యులు దాన్ని అవహేళ చేస్తున్నట్లు ప్రధాని ఆరోపించారు. కొత్త మంత్రులను సభకు మోదీ పరిచయం చేస్తున్న వేళ.. విపక్ష సభ్యులు గందరగోళం సృష్టించారు. అరుపులు, కేకలు, నినాదాలు చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు, ఎస్సీ వర్గానికి చెందినవాళ్లు, ఆదివాసీలు మంత్రులయ్యారని మోదీ అన్నారు. అణగారిని వర్గానికి పెద్దపీట వేస్తుంటే, కొందరు సహించడంలేదన్నారు. ఇదేం రకమైన మానసిక సమస్యో అర్థం కావడం లేదన్నారు. దళితుల వైభవాన్ని ఎందుకు విపక్ష సభ్యులు పట్టించుకోవడం లేదని అన్నారు. తొలిసారి సభలో ఇలాంటి వ్యతిరేకత వ్యక్తం అవుతున్నదని ఆయన తెలిపారు. కొత్త మంత్రులను పరిచేయం చేసే అవకాశం కల్పించినందుకు ఆయన సభకు కృతజ్ఞతలు చెప్పారు.