డెహ్రాడూన్, మే 17: కేదర్నాథ్ ఆలయ ద్వారాలు సోమవారం తెరుచుకున్నాయి. ఏటా శీతాకాలంలో దాదాపు ఆరు నెలల పాటు ఆలయాన్ని మూసివేస్తారు. ఈ సారి ఈ విరామం తర్వాత సోమవారం ఆలయ ద్వారాలను తెరిచిన పూజారులు ప్రధాని మోదీ తరఫున తొలి పూజలు చేశారు. కరోనా నేపథ్యంలో ఐదారుగురు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 11 క్వింటాళ్ల పూలతో ఆలయాన్ని అలంకరించారు. కరోనా సెకండ్వేవ్ కారణంగా భక్తులకు అనుమతి కల్పించలేదు.