శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ టెర్రరిస్టును భద్రతా దళాలు మట్టుబెట్టాయి. కుల్గాం జిల్లాలోని మునంద్ వద్ద ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా ముష్కరులు భద్రతా దళాలపై కాల్పులకు పాల్పడ్డారు. దీంతో భద్రతా బలగాల కాల్పుల్లో ఓ గుర్తు తెలియని ఉగ్రవాది హతమయ్యాడని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఉగ్రవాదుల కోసం గాలింపు ఇంకా కొనసాగుతుందని వెల్లడించారు.