నిడమనూరు, మార్చి 29 : ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న టీఆర్ఎస్ పార్టీని నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో గెలిపించాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ కోరారు. మండల పరిధిలోని తుమ్మడం గ్రామంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు బొక్కల్ వెంకటేశ్వర్లు, కందుకూరి విఘ్నేశ్ ఆధ్వర్యంలో 7వ వార్డు సభ్యుడు పోతుగంటి కోటయ్యతోపాటు 150 మంది కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యేలు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా పార్టీలో చేరుతుండటమే సీఎం కేసీఆర్ పనితీరుకు నిదర్శనమన్నారు. రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు ప్రతి ఇంటికీ అందించి ప్రజల హృదయాలను గెలిచిన సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్కు మద్దతు తెలుపాలన్నారు. కాంగ్రెస్ చేసిందేమీ లేదని, కల్లబొల్లి కబుర్లు చెప్పి ఎన్నికల తర్వాత కనిపించని నాయకులను ప్రజలు తిరస్కరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు చేకూరి హనుమంతరావు, ఎంపీపీ బొల్లం జయమ్మ, డీసీసీబీ డైరెక్టర్ విరిగినేని అంజయ్య, మండలాధ్యక్షుడు తాటి సత్యపాల్, ఎంపీటీసీ పెదమాం యాదయ్య, నాయకులు బొల్లం రవియాదవ్, ఉన్నం చిన్నవీరయ్య, కొయ్యల ఆర్య, చింతపల్లి వెంకన్న, పైస సుధాకర్రెడ్డి, పెదమాం మైసమ్మ, రెమడాల అలివేలు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి..
వచ్చే ఏడాది వరకూ ఇంతే.. కొవిడ్-19 ఎఫెక్ట్పై మెజారిటీ సీఈవోలు
చందా కొచర్కు రిలీఫ్.. ఆమె భర్త దీపక్కు బెయిల్