హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని క్షౌర వృత్తి శాలలకు (హెయిర్ సెలూన్లు), లాండ్రీ షాపులకు, దోభీఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన విద్యుత్ను ఉచితంగా సరఫరా చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
రాష్ట్ర వ్యాప్తంగా రజక సంఘాలు, నాయీ బ్రాహ్మణ సంఘాలు ప్రభుత్వానికి ఈ విషయమై పలు విజ్ఞప్తులు చేశాయి. ఈ విజ్జప్తులను సీఎం కేసీఆర్ నిశితంగా పరిశీలించిన మీదట ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇందుకోసం తక్షణం జీవో జారీ చేయాలని సీఎంవో కార్యదర్శి భూపాల్ రెడ్డికి సీఎం కేసీఆర్ ఆదేశించారు.సీఎం ఆదేశాల మేరకు అధికారులు జీవోను విడుదల చేశారు.
హెయిర్ సెలూన్లు, దోభీఘాట్లకు ఈ నెల ఒకటో తేదీ నుంచి ఈ జీవో ప్రకారం ఉచిత విద్యుత్ సరఫరా అమల్లోకి రానున్నది. అత్యంత బలహీన వర్గాల అభ్యున్నతే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. అత్యంత బలహీన వర్గాల సంక్షేమం కోసం ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
దీంతో మారుమూల గ్రామ స్థాయినుంచి గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) వరకు గల అన్ని హెయిర్ సెలూన్లకు, లాండ్రీ షాపులకు, దోభీ ఘాట్లకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన కరెంట్ ఉచితంగా అందుబాటులోకి రానున్నదన్నారు.
తద్వారా, తర తరాలుగా కుల వృత్తిని ఆధారంగా చేసుకుని జీవనం కొనసాగిస్తున్న రాష్ట్రంలోని లక్షల రజక, నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నదని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
సాంకేతికాభివృద్ది కారణంగా పలు రకాల యంత్రాలు వీరి కుల వృత్తుల నిర్వహణలో దోహద పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఉచిత విద్యుత్తు నిర్ణయం ద్వారా వృత్తి దారులకు శారీరక శ్రమ తగ్గి, ఆర్ధిక వెసులు బాటు కూడా కలగనున్నది.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం
కరోనా ఎఫెక్ట్ : బీహార్లో వారంపాటు విద్యాసంస్థల మూసివేత
కరోనా ఎఫెక్ట్ : జమ్మూకశ్మీర్లో పాఠశాలల మూసివేత
పక్కా ప్లాన్ ప్రకారమే మెషిన్ గన్లు, దేశీ రాకెట్లతో నక్సల్స్ దాడి..!
విద్యా రుణాలకు ఈ బ్యాంకులు బెస్ట్!
రిలయన్స్-ఫ్యూచర్ డీల్కు 6 నెలల గడువు