ఝాన్సీ : తాము ఎక్కాల్సిన రైలు కాకుండా వేరే రైలు ఎక్కామనే భయ ంతో ఐదుగురు నడుస్తున్న రైలు నుంచి దూకేశారు. ఈ ఘటనలో ఒకరు మరణించగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ జిల్లాలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. గోరఖ్పూర్కు చెందిన అజయ్కుమార్ మరో నలుగురితో కలిసి ఝాన్సీ రైల్వేస్టేషన్కి వచ్చి ఆంధ్రప్రదేశ్కు వెళ్లడానికి రైలు ఎక్కారు. కొద్దిదూరం వెళ్లాక ఆ రైలు ఢిల్లీకి వెళ్తున్నదని భయపడి ఒక్కసారిగా కిందకు దూకారు.