ముంబై: దేశ ఆర్థిక రాజధానిలో విషాదం చోటుచేసుకున్నది. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఓ భవనం కుప్పకూలింది. దీంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. సహాయక చర్యలను స్థానిక ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో బిల్డింగ్ కూలిపోయిందని చెప్పారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది బాధితులను కాపాడానికి ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.