నూతనకల్, ఏప్రిల్ 7 : కరోనా వ్యాధి నుంచి రక్షణ పొందేందుకు 45 సంవత్సరాలు పైబడిన వారంతా వ్యాక్సిన్ వేయించుకోవాలని జడ్పీటీసీ కందాల దామోదర్రెడ్డి కోరారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేం ద్రంలో ఆయన వ్యాక్సిన్ వేయించుకున్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి త్రివేణి పాల్గొన్నారు.
47 మందికి టీకా
నాగారం : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం 47మందికి కరోనా టీకాలు వేసినట్లు మండల వైద్యాధికారి డాక్టర్ గాదరి రామకృష్ణ తెలిపారు. 40 మందికి పరీక్షలు చేసినట్లు తెలిపారు. వైద్య సిబ్బంది పార్వతి, కవిత, శోభ, యల్లమ్మ, యాదగిరి, ప్రవీణ్రెడ్డి పాల్గొన్నారు.
225 మందికి పరీక్షలు
అన్ని గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి కరోనా పరీక్షలు చేస్తున్నట్లు మండల వైద్యాధికారి డాక్టర్ నాగూనాయక్ తెలిపారు. గురువారం మండలంలోని తూర్పుగూడెం, గుమ్మడవెల్లి గ్రామాల్లో 225 మంది రోగులకు పరీక్షలు నిర్వహించారు. ఆయన వెంట హెచ్ఈఓ సముద్రాల సూరి, గోవిందరెడ్డి, గాజుల సోమయ్య, నర్సింహాచారి, ఉప సర్పంచ్ మహేందర్గౌడ్, వెంకన్న, వైద్య సిబ్బంది ఉన్నారు.
కరోనా కట్టడికి సహకరించాలి
కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని ఎంపీపీ బీరవోలు రవీందర్రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం కోరారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో కరోనా వ్యాక్సినేషన్పై ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో మాట్లాడారు. 45 ఏండ్లు పైబడిన వారందరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించి, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. కార్యక్రమంలో తాసీల్దార్ వెంకన్న, ఎంపీడీఓ శ్రీనివాస్రావు, అధికారులు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండీ…
వ్యాక్సినేషన్ ముమ్మరంగా చేపట్టాలి : డీఎంహెచ్వో
అంతర్జాతీయ జర్నల్లో మన పోలీస్ ఆర్టికల్
కొవిడ్ బాధితులకు మెరుగైన సేవలందిస్తాం