మైసూరు, జనవరి 30: సంస్కృతభాషలో వెలువడుతున్న ప్రపంచంలోనే ఏకైక దినపత్రికగా పేరున్న ‘సుధర్మ’ ఎడిటర్ కేవీ సంపత్కుమార్ (64) గుండెపోటుతో బుధవారం కన్నుమూశారు. సంస్కృత భాషా పరిరక్షణకు అందించిన సేవలకుగానూ సంపత్కుమార్, ఆయన సతీమణి విజయలక్ష్మిని గతేడాది కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. సుధర్మ దినపత్రికను సంపత్ తండ్రి కేవీ వరదరాజ అయ్యంగార్ 1970లో ప్రారంభించారు. సంపత్ మృతిపట్ల ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.