దాతియా: మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రాకు అనూహ్య పరిస్థితి ఎదురైంది. దతియా జిల్లాలో వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఆ ఆపరేషన్ను దగ్గర ఉండే నిర్వహించేందుకు మంత్రి ప్రత్యేక బోట్లో అక్కడికి వెళ్లారు. అయితే భారీగా వస్తున్న వరదల ధాటికి మంత్రి ఉన్న బోటుపై చెట్టు పడింది. దీంతో ఆ బోటు ఇంజిన్ ఫెయిలైంది. ఆ వరద నీటిలో చిక్కుకున్న మంత్రిని ప్రత్యేక రెస్క్యూ దళం కాపాడింది. ఎస్డీఆర్ఎఫ్ బోటులో సర్వేకు వెళ్లిన మంత్రికి చేదు అనుభవం ఎదురైంది. ఓ ఇంటి టెర్రెస్పై చిక్కుకున్న 9 మందిని రక్షించేందుకు చేపట్టిన ఆపరేషన్ను మంత్రి పర్యవేక్షించారు. అయితే తొలుత ఇంటిపై చిక్కుకున్న వారిని రక్షించారు. ఆ తర్వాత మంత్రిని ఎస్డీఆర్ఎఫ్ దళాలు ఎయిర్లిఫ్ట్ చేశాయి. ఈ ఘటనపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ మండిపడింది. బీజేపీ చాలా ప్రమాదకరమైన స్టంట్లు చేస్తున్నట్లు ఆరోపించింది. స్పైడర్మ్యాన్లో నటించేందుకు హోంమంత్రి ప్రయత్నించారని, దాని వల్ల ఆయన ప్రాణాలకే ముప్పు అన్నారు.