ఈనెల 26న రెండు, 28న మూడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
వికారాబాద్ జిల్లాలో 70 వేల ఎకరాల్లో సాగు
ఈసారి పెరిగిన సాగు విస్తీర్ణం
1,74,073.80 మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా
25 లక్షల గన్నీ బ్యాగులు అవసరం
ప్రస్తుతం అందుబాటులో13.63 లక్షల సంచులు
రైతులకు టోకెన్లు ఇస్తున్న వ్యవసాయ అధికారులు
వికారాబాద్, మార్చి 23, (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు వికారాబాద్ జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈనెల 26న రెండు, 28న మూడు కొనుగోలు కేంద్రాల ప్రారంభించనున్నారు. జిల్లావ్యాప్తంగా 70 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా, 1,74,073.80 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. ఇందుకు అనుగుణంగా 25 లక్షల గన్నీ బ్యాగులు అవసరం ఉండగా, ప్రస్తుతం 13.63 లక్షల సంచులు అందుబాటులో ఉన్నాయి. ధాన్యం కొనుగోలు కోసం అధికారులు రైతులకు టోకెన్లను అందజేస్తున్నారు.
ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంస్, మార్కెట్ కమిటీల నేతృత్వంలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేశారు. జిల్లాకు 25 లక్షల గన్నీ బ్యాగులు అవసరం ఉందని అంచనా వేశారు. ప్రస్తుతానికి 13.63లక్షల సంచులు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో 1,74,073.80 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందనే అంచనాతో ఏప్రిల్లో 30 వేలు, మేలో 60వేలు, జూన్లో 10వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాలకు రానున్నాయని అంచనా వేశారు. మిగిలిన 74వేల ధాన్యం ఇతర అవసరాలకు, మిల్లులకు వెళ్లే అవకాశం ఉంది. దిగుబడి అంచనాతో జిల్లా వ్యాప్తంగా ఈ 191 కేంద్రాల ద్వారా… ప్రాథమిక వ్యవసాయ పరపతి(పీఏసీఎస్) 52, ఇందిరాక్రాంతి పథకం(ఐకేపీ) 80, వ్యవసాయ మార్కెట్(ఏఎంసీ) 5, డీసీఎంస్ 54 చొప్పున కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ యాసంగిలో వికారాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో వరి సాగు చేశారు. గతేడాది ఇదే సీజన్లో 29 వేల ఎకరాల్లో వరి సాగు కాగా.. ఈసారి 69,667 ఎకరాల్లో వరి సాగు చేశారు. పెరిగిన సాగుకనుగుణంగా జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో 191 కేంద్రాల్లో మొదట 21 కేంద్రాలను ప్రారంభం చేసేందుకు సిద్ధం చేశారు. 26వ తేదీన మెట్లకుంట, కొత్తూరులో, 28న గౌరరాం, మైల్వార్, సాలీమందర్పూర్లలో ప్రారంభం చేయనున్నారు. మిగతావి వచ్చేనెల 1వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ కొనుగోలు కేంద్రాల వద్ద ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా మంత్రి సబితారెడ్డి అధికారులను ఆదేశించారు.
ధాన్యం సేకరణకు టోకెన్లు జారీ ..
కరోనా సెంకడ్ వేవ్ నేపథ్యంలో కేంద్రాల్లో రైతులు గుమిగూడి ఉండకుండా టోకెన్లు జారీ చేసేలా ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆయా గ్రామాల వ్యవసాయ అధికారులు రైతులకు టోకెన్లు జారీ చేసే పనిలో ఉన్నారు. ఏ గ్రేడ్ రకం క్వింటాల్కు రూ.1,888,సాధారణ రకం రూ.1,868కి కొనుగోలు చేయనున్నారు.
కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తాం
కొనుగోలు కేంద్రాల ద్వారా నాణ్యమైన ధాన్యం సేకరించి మిల్లులకు తరలించాలి. ఈనెల 26వ తేదీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం. కోతలకు అనుగుణంగా మిగతావి అంచెలంచెలుగా ప్రారంభం చేస్తాం. పౌరసరఫరాల శాఖ అధికారి రాజేశ్వర్ నేతృత్వంలో కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షిస్తారు. ధాన్యాన్ని పరిశీలించేందుకు మాయిశ్చరింగ్ మిషన్, చెత్త లేకుండా తూర్పారా బట్టేందుకు ప్యాడీ క్లీనర్లు, వెయింగ్ మిషన్లు, హమాలీలు అందుబాటులో ఉన్నారు.
ఇవి కూడా చదవండి
IPL 2021: రోహిత్ శర్మ ఒంటరి పోరాటం..ముంబై స్కోర్ 131
IPL 2021: ముంబై బ్యాట్స్మెన్ను వణికిస్తున్న పంజాబ్ బౌలర్లు
మహారాష్ట్రలో కొత్తగా 66,836 కరోనా కేసులు.. 773 మరణాలు