అహ్మదాబాద్ : కొవిడ్-19 నుంచి కోలుకుంటున్న 80 ఏండ్ల వృద్ధుడు బ్లాక్ ఫంగస్ సోకిందనే భయంతో విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అహ్మదాబాద్ లో వెలుగుచూసింది. నగరంలోని పల్ది ప్రాంతంలో అమన్ అపార్ట్ మెంట్స్ లో నివసించే నిరంజన్ పటేల్ (80) తన శరీరంపై తెల్ల మచ్చలు, ఫంగల్ ఇన్ఫెక్షన్ ను గుర్తించడంతో మే 27న విషం సేవించి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
బ్లాక్ ఫంగస్ వల్లే తన శరీరంపై మచ్చలు వచ్చాయనే భయంతో ఆయన తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. కరోనా వైరస్ నుంచి ఇటీవల కోలుకున్న పటేల్ తాను మధుమేహం, కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నందున బ్లాక్ ఫంగస్ దాడి నుంచి తప్పించుకోలేనని భయపడినట్టు స్ధానిక ఎస్ఐ జేఎం సోలంకి వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు.