హైదరాబాద్ : దేశంలో వ్యవసాయ రంగానికి ఇంత బడ్జెట్ కేటాయిస్తున్న రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమే. ఇది పూర్తిగా రైతు ప్రభుత్వమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. గురువారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా ఉందని మంత్రి ప్రశంసించారు. ఈ సందర్భంగా
ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు, మంత్రి హరీష్ రావుకు శుభాకాంక్షలు తెలిపారు. రైతుబంధు, రైతుబీమా పథకాలు కొనసాగిస్తూనే వ్యవసాయ యాంత్రీకరణకు రూ.1500 కోట్లు కేటాయించారన్నారు.
కూలీల కొరత నేపథ్యంలో వ్యవసాయ యాంత్రీకరణ కోసం రైతాంగం ఆశగా ఎదురుచూస్తున్నది
. వ్యవసాయంలో యాంత్రీకరణ అత్యవసరం. అందుకే సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని నిధులు కేటాయించారన్నారు. రైతుల రుణమాఫీ కోసం రూ.5225 కోట్లు కేటాయించారని వివరాలను వెల్లడించారు. రైతుబీమా కోసం రూ.1200 కోట్లు రైతు బంధు కోసం రూ.14,800 కోట్లు కేటాయించారు. 8.14 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ విస్తరణ కోసం రైతులను ప్రోత్సహించేందుకు ఎకరాకు రూ.30 వేల సబ్సిడీ రైతులకు ఇచ్చేందుకు బడ్జెట్ లో నిధుల కేటాయింపు
జరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు.