హైదరాబాద్ : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన కాళ్ళ లక్ష్మిరాజం అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో లక్ష్మిరాజం చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ. 60 వేలు మంజూరు కావడం జరిగింది. ఈ నగదుకు సంబంధించిన చెక్కును శనివారం హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో లక్ష్మిరాజం కుమారుడు ముక్కు అవినాష్కు మంత్రి కొప్పుల ఈశ్వర్ అందజేశారు.