భువనేశ్వర్: స్మార్ట్ఫోన్ కొనేందుకు కట్టుకున్న భార్యను ఓ వ్యక్తి అమ్మేసిన ఘటన ఒడిశాలో చోటుచేసుకున్నది. రాష్ర్టానికి చెందిన 17 ఏండ్ల బాలుడికి గత జూలైలో పెండ్లి జరిగింది. పని నిమిత్తం భార్యతోపాటు రాజస్థాన్కు వెళ్లిన అతనికి స్మార్ట్ఫోన్ కొనాలన్న ఆశ కలిగింది. దీంతో కట్టుకున్న భార్యను రూ.1.8 లక్షలకు.. 55 ఏండ్ల వ్యక్తికి అమ్మేశాడు. ఆ డబ్బుతో ఫోన్ కొనుక్కొన్నాడు. బాధితురాలు కనిపించక పోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది.