భువనేశ్వర్: ఒడిశా రాజధాని భువనేశ్వర్ను యాచకుల రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ఒక ఎన్జీవో సంస్థ వినూత్నంగా ప్రయత్నిస్తున్నది. ఒడియా సంస్కృతికి చెందిన కవితలు పఠించే విధానమైన ‘చాకులియా పాండాలు’ ద్వారా ప్రజలకు అవకాహన కల్పిస్తున్నది. ఒడిశా పటితా ఉధర్ సమితి (ఒపస్) అనే ఎన్జీఓ సంస్థ, భువనేశ్వర్ మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)తో కలిసి ఈ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది.
యాచకులకు డబ్బులు ఇవ్వవద్దని ఒడియా కవితల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు ఆ ఎన్జీవో సంస్థకు చెందిన సమన్వయకర్త మాతృమయ ప్రియదర్శిని తెలిపారు. భిక్షగాళ్లు ఎవరిపై ఆధారపడకుండా మనలో ఒకరిగా జీవించాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. నిరాశ్రయులైన యాచకులకు ఆశ్రయం కల్పిస్తున్నామని ఆమె వెల్లడించారు.