భువనేశ్వర్ : కరోనా కట్టడికి ఒడిషాలో అమలవుతున్న పాక్షిక లాక్డౌన్ను జులై 16 వరకూ పొడిగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. పలు సడలింపులతో నియంత్రణలను జులై 16 వరకూ పొడిగించాలని నిర్ణయించామని ఒడిషా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్చంద్ర మహాపాత్ర బుధవారం ప్రకటించారు.
5 శాతం లోపు పాజిటివిటీ రేటు నమోదవుతున్న 20 జిల్లాల్లో వీకెండ్ షట్డౌన్ ఉండదని మహాపాత్ర పేర్కొన్నారు. మాల్స్, పార్లర్లు మినహా షాపులన్నింటినీ ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ తెరిచిఉంచేందుకు అనుమతిస్తామని అన్నారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ సెలూన్లను ఓపెన్ చేయవచ్చని, ప్రజా రవాణాలో సీటింగ్ సామర్థ్యం మేరకు వాహనాలను అనుమతిస్తామని చెప్పారు.