భువనేశ్వర్ : కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పలు రాష్ట్రాల్లో సీనియర్ నేతలు పార్టీని వీడుతున్న నేపధ్యంలో తాజాగా ఒడిషా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రదీప్ మాఝీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి శుక్రవారం ఆయన తన రాజీనామా లేఖను పంపారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితో పాటు ప్రాధమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు.