భువనేశ్వర్: దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్నది. అన్ని రాష్ట్రాలతోపాటు ఒడిశాలోనూ కరోనా వైరస్ విజృంభిస్తున్నది. ఈ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అక్కడ సంపూర్ణ లాక్డౌన్ విధించింది. అయితే లాక్డౌన్ కారణంగా వ్యాపార, సేవా కార్యకలాపాలు అన్నీ నిలిచిపోయాయి. రోడ్లపై జనం సంచారం లేకుండా పోయింది. దాంతో వీధుల్లో కుక్కలు, ఇతర జంతువులు ఆహారం దొరకడం గగనమైంది.
ఈ నేపథ్యంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వీధి జంతువుల కడుపు నింపడం కోసం ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వీధి జంతువుల ఆహారం కోసం రూ.60 లక్షలు కేటాయించారు. రాష్ట్రంలోని ఐదు మున్సిపల్ కార్పొరేషన్లు, 48 మున్సిపాలిటీలు, 61 నోటిఫైడ్ ఏరియా కౌన్సిళ్లలో వీధి జంతువులకు ఆహారం అందజేయం కోసం ఈ నిధులను ఖర్చు చేయనున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
301 జిల్లాల్లో 20 శాతానికిపైగా పాజిటివిటీ రేటు: కేంద్రం
కాబూల్ పేలుళ్లు: 50 దాటిన మృతుల సంఖ్య
క్షణికావేశంలో భార్యను చంపి భర్త ఆత్మహత్య
పండ్లలో విటమిన్.. ఇమ్యూనిటీ పెంచెన్
మైదా పిండి.. కొడుతుందట ఆరోగ్యానికి గండి..!
మహమ్మారి మరణ మృదంగం.. వరుసగా రెండో రోజూ 4 వేలకుపైగా మృతులు
గోమూత్రం తాగండి.. కరోనాను నిలువరించండి: బీజేపీ ఎమ్మెల్యే సలహా