చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ స్వల్ప వ్యవధిలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. అర్ధశతకం సాధించి జోరుమీదున్న సూర్య కుమార్ యాదవ్(56).. షకీబ్ అల్ హసన్ వేసిన 11వ ఓవర్లో వెనుదిరిగాడు. పాట్ కమిన్స్ వేసిన తర్వాతి ఓవర్లో అప్పుడే క్రీజులోకి వచ్చిన యువ బ్యాట్స్మన్ ఇషాన్ కిషన్(1) పెవిలియన్ చేరాడు. దీంతో ముంబై స్కోరు వేగం తగ్గింది. మరో ఎండ్లో కెప్టెన్ రోహిత్ శర్మ(29) ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం హార్దిక్ పాండ్య(4) క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. 13 ఓవర్లకు ముంబై 3 వికెట్లకు 94 పరుగులు చేసింది.