న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: ఢిల్లీలోని రోహిణి కోర్టు ఆవరణలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన కాల్పుల ఘటనపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఘటన నేపథ్యంలో కోర్టు కార్యకలాపాలకు అంతరాయం కలుగకుండా చూడాలని, ఇందులో భాగంగా బార్, పోలీసులతో మాట్లాడాలని ఆయనకు సూచించారు. కోర్టుల భద్రత అంశం ఇప్పటికే సుప్రీంకోర్టు పరిశీలనలో ఉందని, వచ్చే వారం దీన్ని ప్రాధాన్యతాంశంగా పరిశీలిస్తామని తెలిపారు.