కనుల పండువగా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి పట్టాభిషేకం
మంత్రాలయం, మార్చి 15 : మంత్రాలయం రాఘవేంద్రస్వామి పట్టాభిషేకం రమణీయంగా.. కనుల పండువగా నిర్వహించారు. శ్రీమఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో సోమవారం తెల్లవారుజామున రాఘవేంద్రస్వామి మూల బృం దావనానికి సుప్రభాత సేవ, పాదపూజ, పంచామృతాభిషేకం పూజలు చేశారు. రామమందిరంలో మూలరాములకు పీఠాధిపతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాఘవేంద్రస్వామి పాదాల కు ఉంజల్సేవ, పల్లకీలో ఉంచి ప్రత్యేక పూజలు చే శారు. ప్రత్యేక పూలతో అలంకరించిన స్వర్ణ రథంపై భక్తుల హర్షధ్వానాలు, భాజా భజంత్రీల మధ్య మ ఠం ప్రాకారం చుట్టూ ఊరేగించారు. మంత్రాల యం సమీపంలోని ఆర్చి వద్ద నూతనంగా ప్రతిష్ఠించిన 32 అడుగుల ఏకశిలా అభయాంజనేయస్వా మి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పీఠాధిపతి, ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, మఠం ఆప్త కా ర్యదర్శి సూశమీంద్ర తీర్థులు రాముడి సన్నిధి నిర్మాణానికి భూమిపూజ చేశారు. భక్తుల విరాళాలు, దా తల సహకారంతో సుమారు రూ.5 కోట్లతో రా ముడి సన్నిధి నిర్మాణం చేపడుతున్నట్లు పీఠాధిపతి తెలిపారు. కార్యక్రమంలో పండిత కేసరి రాజ ఎస్ గిరిరాజ్ చారి, ఏఏవో మాధవశెట్టి, శ్రీపతి, ఇంజినీర్ సురేశ్, సర్పంచ్ భీమయ్య, భీంరెడ్డి, ఎస్సై వే ణుగోపాల్రాజు, న్యాయవాదులు పాల్గొన్నారు.