మెదక్ : విద్యుత్ వైర్లు మరమ్మతు చేస్తుండగా కరెంటు షాక్కు గుర ఓ రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన హవేళి ఘణపూర్ మండలం బొగుడభూపతిపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మంద మొగులయ్య(32) గురువారం పొలం వద్దకు వెళ్లాడు. కాగా మోటర్ వద్ద మరమ్మతులు చేస్తుండగా తెగిపోయిన వైరు కాలుకు తగలడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ శేఖర్రెడ్డి పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య మమత, కుమార్తె, కుమారుడు ఉన్నారు.