మద్దూరు, ఏప్రిల్ 29 : మండల వ్యాప్తంగా వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. కొన్ని రోజులుగా వాతావరణంలో వస్తున్న మార్పులతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వర్షం రాకముందే రైతులు వరికోత యంత్రాల వెంట పరుగులు తీస్తున్నారు. ఉమ్మడి మద్దూరు మండల వ్యా ప్తంగా ఈ ఏడాది యాసంగి సీజన్లో 14,827 ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. ఇప్పటి వరకు 30 శాతం వరికోతలు పూర్తికావడం జరిగింది. రైతులు ముందుగానే వరికోతలు చేపడుతున్నారు. దీంతో వరికోత యంత్రాలకు డిమాండ్ పెరిగింది. వరికోత యంత్రానికి(హర్వెస్టర్) గం టకు రూ.2వేల ఉండగా, ప్రస్తుతం గంటకు రూ.2500 పైగా పెంచడం జరిగింది.
దౌల్తాబాద్లో…
దౌల్తాబాద్, ఏప్రిల్ 29 : మండలంలో వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. వ్యవసాయ బోర్ల కింద రైతు లు సాగు చేసిన వరి పంట కోతకు వచ్చాయి. కోతకు వచ్చిన పంటను కోసేందుకు రైతులు బిజీ అయ్యారు. వరి కోత మిషన్లు సైతం గ్రామాల్లోని పంట పొలాలకు చేరుకున్నాయి. మం డలంలో గాజులపల్లి, దొమ్మాట, గొడుగుపల్లి తదితర గ్రామాల్లో వరి కోతలు జోరందుకున్నాయి. రైతులు ధాన్యా న్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి ఆరబెడుతున్నారు.