నొయిడా : కొవిడ్-19 రోగులు ఆక్సిజన్ పడకలు, మందులు, ప్రాణాధార ఔషధాలు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్న క్రమంలో నొయిడాలో కరోనా రోగుల కుటుంబ సభ్యులు రెమ్డిసివిర్ ఔషధం కోసం వైద్యాధికారి కాళ్లావేళ్ల పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కరోనా రోగుల బంధువులు, కుటుంబసభ్యులు నొయిడా ముఖ్య వైద్యాధికారి దీపక్ వొహ్రి కాళ్లు పట్టుకుని ప్రాధేయపడుతున్నట్టు కనిపించిన ఈ వీడియో నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది.
యూపీలో కొవిడ్-19 రోగులకు అన్ని సదుపాయాలను ఆస్పత్రుల్లో కల్పించామని సీఎం యోగి ఆదిత్యానాథ్ చెబుతున్నా క్షేత్రస్ధాయిలో పరిస్ధితిపై నెటిజన్లు విస్మయం వ్యక్తం చేశారు. మరోవైపు కొవిడ్-19 సెకండ్ వేవ్ తో యూపీలో రెమ్డిసివిర్, ఆక్సిజన్ పడకల కొరతపై తీవ్రస్ధాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.