భూపాలపల్లి రూరల్, ఏప్రిల్ 2 : యేసుక్రీస్తు చూపిన సత్యమార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని సుభాష్కాలనీ బేతెస్థ చర్చి పాస్టర్ రాజవీరు అన్నారు. గుడ్ప్రైడేను పురస్కరించుకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సీఎస్ఐ బాప్టిస్టు, రోమన్ క్యాథలిక్, తదితర ప్రార్థన మందిరాల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ క్రైస్తవులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్కాలనీలో జరిగిన కార్యక్రమంలో పాస్టర్ మాట్లాడుతూ.. యేసుక్రీస్తు సిలువలో పాప పరిహార బలి అర్పించాడని తెలిపారు. ఈ నేపథ్యంలో శుభ శుక్రవారం (గుడ్ప్రైడే) రోజున యేసు ప్రేమను, త్యాగాన్ని ధ్యానిస్తూ సిలువ యాత్ర చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో శ్రీనివాస్, సంతోష్, రాజు, లక్ష్మి, రాజయ్య, పద్మ తదితరులు పాల్గొన్నారు.
సిలువ ఊరేగింపు
ములుగురూరల్: యేసు మార్గాన్ని అనుసరించాలని చర్చి ఫాదర్లు అన్నారు. జిలా కేంద్రంలో క్రైస్తవులు గుడ్ ప్రైడేను జరుపుకున్నారు. యేసు సిలువను ఊరేగించిన అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వేడుకల్లో ఫాదర్ జోసెఫ్ మహిపాల్, సిస్టర్ జ్యోతి, మరియా, రెజిచాకో, సూపీరియర్ సిస్టర్ సుపాన్, భద్రి, అజయ్పాల్, ప్రదీప్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
మంగపేటలో గుడ్ఫ్రైడే ..
మంగపేట: గుడ్ఫ్రైడే సందర్భంగా మండలంలోని పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మానవాళిని పాప విమోచనం చేయడానికి యేసుక్రీస్తు ప్రాణాలు ఆర్పించి, తిరిగి మూడో రోజు లేచి వచ్చాడని పాస్టర్లు, ఫాదర్లు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ పాస్టర్లు కే ఆదాము, ఎస్ విజయరాజు, వీ దేవరాజు, టీ కృపానిధి, జానేష్, శ్యాంసుందర్, శ్రీనివాసపాల్, రాజా ఇమ్మానుయేల్, ప్రేమానందం, బర్నబాస్ పాల్గొన్నారు.
రాపెల్లికోట చర్చిలో…
మహదేవపూర్ : మండలకేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లోని చర్చిల్లో గుడ్ఫ్రైడే సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాపెల్లికోట చర్చిలో యేసుక్రీస్తు సిలువలో పలికిన మాటలను పాస్టర్ వివరించారు. కరోనా ప్రభావం తగ్గాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో అబ్రహం, పాస్టర్లు జోసెఫ్ ప్రకాశ్, సురేశ్, దేవదాస్, క్రైస్తవులు పాల్గొన్నారు.
ఇవి కూడా చూడండి..
50 రోజులు.. 4 వేల కి.మీ. గిన్నిస్ రికార్డే ఈ సైనికుడి లక్ష్యం
పెట్రోల్, డీజిల్ విక్రయాల్లో పెరుదల