సితాల్కుచి: బెంగాల్లోని కూచ్ బెహర్ జిల్లాలో ఉన్న సితాల్కుచి నియోజకవర్గంలో ఇవాళ ఉదయం హింస చోటుచేసుకున్న విషయం తెలిసిందే. జోర్పట్కీలోని 126వ పోలింగ్ బూత్ వద్ద జరిగిన కాల్పుల్లో అయిదుగురు మృతిచెందారు. ఈ నేపథ్యంలో ఆ సెంటర్ వద్ద పోలింగ్ను నిలిపివేసినట్లు ఎన్నికల సంఘం పేర్కొన్నది. బెంగాల్లో ఇవాళ నాలుగవ దశ ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం మూడు గంటల వరకు 44 స్థానాల్లో 66.76 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఈసీ చెప్పింది. సితాల్కుచిలో జరిగిన హింసకు కేంద్ర బలగాలే కారణమని తృణమూల్ ఆరోపిస్తున్నది. తృణమూల్ రెచ్చగొట్టడం వల్లే అక్కడ హింస చోటుచేసుకున్నట్లు బీజేపీ పేర్కొన్నది.