పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్పై సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్పై గతంలో తామిచ్చిన తీర్పును పునఃసమీక్షించబోమని మంగళవారం సుప్రీంకోర్టు తెలిపింది. దళిత వర్గాలకు ఈ విషయంలో కోటాను ఎలా అమలు చేయాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ నాగేశ్వర్రావు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టంచేసింది. కోటా అమలులో అడ్డంకులు తలెత్తుతున్నాయన్న రాష్ట్ర ప్రభుత్వాల వాదనపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ధర్మాసనం.. అడ్డంకులకు సంబంధించిన సమగ్ర విషయాలను రెండు వారాల్లోగా సమర్పించాలని అడ్వకేట్ ఆన్ రికార్డ్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ను ఆదేశించింది. కాగా, పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్కు మార్గం సుగమం చేస్తూ 2018లో కోర్టు తీర్పు వెలువరించింది.