ముంబై: పశ్చిమ బెంగాల్లో హింస గురించి మాత్రమే బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతున్నాయని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు. బెల్గాంలో గత 8 రోజులుగా మరాఠీ ప్రజలపై దాడి జరుగుతున్నదని, దీని గురించి ఎవరూ మాట్లాడటం లేదని ఆయన మండిపడ్డారు. అఖిలపక్ష ప్రతినిధి బృందంతో కలిసి బెల్గాంకు వెళ్లాలని సీఎం, డిప్యూటీ సీఎంను విజ్ఞప్తి చేస్తున్నానని సంజయ్ రౌత్ అన్నారు.
కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన బెలగావిలో కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు శుక్రవారం మరాఠీ భాషలో ఉన్న పలు సైన్ బోర్డులు, పేర్లపై నల్ల రంగు పూశారు. మరాఠీలో ఉన్న బోర్డులను తొలగించారు. ఈ నేపథ్యంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నది.
ఈ ప్రాంతం తమకు చెందినదంటూ ఈ రెండు రాష్ట్రాలు చాలా కాలంగా వాదించుకుంటున్నాయి. ఈ వివాదం ఎన్నో ఏండ్లుగా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.