న్యూఢిల్లీ : ఉత్తర భారతదేశానికి వడగాలుల ముప్పు ఉందని భారత వాతావరణ శాఖ ( IMD ) హెచ్చరించింది. రానున్న రెండు రోజుల్లో తీవ్ర వేడి గాలులు వీస్తాయని పేర్కొన్నది. ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్పై వేడి గాలుల ప్రభావం చూపనుంది. జమ్మూకశ్మీర్లో పలు చోట్ల నిన్న వేడి గాలులను ఐఎండీ గుర్తించింది. పాకిస్తాన్లో పొడి గాలులతో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని ఐఎండీ పేర్కొంది.