చెన్నై: ఐపీఎల్ తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ను కట్టడి చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. చేజింగ్లో అప్పుడే రెండు వికెట్లు కోల్పోయింది. పవర్ ప్లే ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. ఓపెనర్గా వచ్చిన వాషింగ్టన్ సుందర్ (10), తొలి మ్యాచ్ ఆడుతున్న రజత్ పటీదార్ (8) అవుటయ్యారు. మరో ఓపెనర్, కెప్టెన్ విరాట్ కోహ్లి ధాటిగా ఆడుతున్నాడు.