కామారెడ్డి రూరల్/నిజాంసాగర్/గాంధారి/ నస్రుల్లాబాద్ , మే 3: టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల పండుగలకు సమప్రాధాన్యం ఇస్తున్నదని పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు అన్నారు. క్రిస్మస్, రంజాన్, బతుకమ్మ పండుగలను నిర్వహించడంతోపాటు, పేదలు పండుగలను ఆనందంగా జరుపుకొనేందుకు దుస్తులను పంపిణీ చేస్తున్నట్లు గుర్తుచేశారు. రంజాన్ పండుగ సందర్భంగా పలు గ్రామాల్లో పేద ముస్లిములకు సోమవారం దుస్తులను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న దుస్తులను కామారెడ్డి మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ ఆంజనేయులు సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండుగలను సోదరభావంతో కలిసిమెలిసి జరుపుకోవాలని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రవితేజగౌడ్, పందిరి మంజుల, నారాయణరెడ్డి, మాజీ సర్పంచ్ రమాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నిజాంసాగర్ మండలంలోని మంగ్లూర్ గ్రామంలో సర్పంచ్ స్వప్న రమేశ్, ఎంపీటీసీ జనార్దన్, మల్లూర్లో వైస్ ఎంపీపీ మనోహర్, సర్పంచ్ ఖాసీంసాబ్ సోమవారం ముస్లిములకు గిఫ్ట్ ప్యాక్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని వర్గాల ప్రజల పండుగలకు దుస్తులు అందజేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో నాయకులు బాబుసేట్ తదితరులు ఉన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పేద ముస్లిం కుటుంబాలకు అందజేసిన రంజాన్ కానుకలను సోమవారం గాంధారి తహసీల్ కార్యాలయ ఆవరణలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సంగమేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ముస్లిం కుటుంబాలు రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్ధేశంతో కానుకలు అందజేస్తున్నట్లు తెలిపారు. మండలంలోని 200 నిరుపేద ముస్లిం కుటుంబాలకు కానుకలను అందజేసినట్లు వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ రాధాబలరాం, ఏఎంసీ చైర్మన్ సత్యం, గాంధారి సర్పంచ్ మమ్మాయి సంజీవ్, విండో చైర్మన్ సాయికుమార్, ఏవో యాదగిరి, ఆర్ఐ నర్సింహరెడ్డి, ఎంపీటీసీలు తూర్పు రాజు, బాలరాజు, మండల కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ ముస్తఫా, మైనార్టీ నాయకుడు గౌస్ తదితరులు పాల్గొన్నారు.
నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని మజీద్లో సోమవారం మజీద్ సదర్ కలీల్ ముస్లింలకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రంజాన్ తోఫా మంజురయ్యాయ్యన్నారు. దీనిలో భాగంగా 45 మందికి దుస్త్తులను పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడు మైశాగౌడ్, నాయకులు లక్ష్మీనారాయణ గౌడ్, బబ్బు తదితరులు పాల్గొన్నారు.