బెంగళూరు : కర్ణాటకలో ఉప ఎన్నికలు ముగిసిన అనంతరం లాక్డౌన్ విధించే అవకాశం ఉందని వస్తున్న వార్తలపై ఆ రాష్ర్ట డిప్యూటీ సీఎం డాక్టర్ సీఎన్ ఆశ్వత్ నారాయణ్ స్పందించారు. కర్ణాటకలో ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్డౌన్ విధించబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో సీఎం యెడియూరప్ప కూడా స్పష్టంగా ఉన్నారని తెలిపారు. అయితే ప్రజల జీవనోపాధికి భంగం వాటిల్లకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
బెంగళూరు సిటీ పశ్చిమ ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసులు అధికమవుతున్న నేపథ్యంలో రోజుకు పది వేలకు పైగా కరోనా టెస్టులు నిర్వహించాలని బృహత్ బెంగళూరు మహానగర పాలికేకు ఆదేశాలు జారీ చేశామన్నారు. పశ్చిమ జోన్లోని ఆస్పత్రుల్లో బెడ్ల కొరత లేదని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఈ జోన్లో 4,500 మంది తమ నివాసాల్లోనే చికిత్స పొందుతున్నారని తెలిపారు. మరో 700 మంది ఆస్పత్రుల్లో చేరారని పేర్కొన్నారు.