ముంబై, ఏప్రిల్ 7: దేశీయ కరెన్సీకి కరోనా సెగ గట్టిగానే తగిలింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ బుధవారం ఒకేరోజు 105 పైసలు పడిపోయింది. గడిచిన 20 నెలల్లో ఇంతటి స్థాయిలో పతనమవడం ఇదే తొలిసారి. ఫారెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి మారకం విలువ 74.47 స్థాయికి జారుకున్నది. గతేడాది నవంబర్ 13 తర్వాత ఇదే కనిష్ఠ స్థాయి ముగింపు. ఆగస్టు 5, 2019న కరెన్సీ చరిత్రలో భారీ నష్ఠాన్ని నమోదు చేసుకున్నది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో అంతర్జాతీయ ఈక్విటీ, ఫారెక్స్ మార్కెట్లలో ఆలజడి సృష్టించింది. 73.52 స్థాయి వద్ద ప్రారంభమైన మారకం విలువ ఒక దశలో 74.50 స్థాయికి జారుకున్నది.