సంగారెడ్డి : లారీ డ్రైవర్ అజాగ్రత్తగా వాహనాన్ని నడుపడంతో కారులో ఉన్న ఓ వ్యక్తి మృత్యువాత పడిన సంఘటన జిల్లాలోని కోహీర్ మండలం దిగ్వాల్ గ్రామ 65వ జాతీయ రహదారిపై శనివారం రాత్రి చోటు చేసుకొంది. ఎస్ఐ చల్లా రాజశేఖర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
వికారాబాద్ జిల్లా శంకర్పల్లి మండలంలోని ఎల్వర్తి గ్రామానికి చెందిన గురోత్తంరెడ్డి(47)తో పాటు డ్రైవర్ రాఘవేందర్రెడ్డి, గ్రామస్తులు వెంకట్రెడ్డి, కనకారెడ్డి, నాగరాజు, సుదర్శన్రెడ్డితో కలిసి జహీరాబాద్కు వచ్చి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.
అనంతరం కారులో తమ ఇంటికి తిరుగుప్రయాణమయ్యారు. కాగా, దిగ్వాల్ గ్రామానికి చేరుకోగానే కారు ముందు ఉన్న లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకు వేయడంతో కారు వెనుకనుంచి లారీని ఢీకొంది.
దీంతో ముందు సీటులో కూర్చున్న గురోత్తంరెడ్డి తలకు తీవ్రగాయాలు కావడంతో సంఘటన స్థలంలోనే చనిపోయాడు.
డ్రైవర్ రాఘవేందర్రెడ్డికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జహీరాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
జొన్నకుప్ప దగ్ధం.. రూ.45వేల నష్టం
ఆలస్యంగా నిద్ర పోతున్నారా..? మెదడు పనితీరు తగ్గుతుందట..!
సారీ.. ఆ లోగో ఉంటే చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ వేసుకోలేను: మొయిన్ అలీ