సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు మరో ఛాన్స్ ఇవ్వం..

న్యూఢిల్లీ: గత ఏడాది కోవిడ్ మహమ్మారి వల్ల యూపీఎస్సీ పరీక్షలకు హాజరుకాలేకపోయిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ అభ్యర్థులకు మరో అవకాశం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. సుప్రీంకోర్టుతో ఇవాళ కేంద్రం ఈ విషయాన్ని చెప్పింది. అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు ప్రభుత్వం తరపున కోర్టుకు ఈ విషయాన్ని విన్నవించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ తరపున ఆయన వాదించారు. జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారిస్తున్నది. సివిల్స్ అభ్యర్థులకు మరో ఛాన్స్ ఇచ్చేందుకు తాము సిద్ధంగా లేమని, ఈ అంశంలో అఫిడవిట్ దాఖలు చేసేందుకు తనకు సమయం ఇవ్వాలని అడిషనల్ సొలిసిటర్ జనరల్ రాజు కోర్టును కోరారు. రచనా సింగ్ అనే సివిల్స్ అభ్యర్థి కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసులో తీర్పును 25వ తేదీన వినిపించనున్నారు.
తాజావార్తలు
- 2 లక్షల ఖరీదైన టీవీని విడుదల చేసిన ఎల్జీ
- పిచ్ను విమర్శిస్తున్న వాళ్లపై కోహ్లి ఫైర్
- సెక్స్ టేప్ కేసు.. కర్నాటక మంత్రి రాజీనామా
- ఆచార్య శాటిలైట్ రైట్స్ కు రూ.50 కోట్లు..?
- అర్బన్ ఫారెస్ట్ పార్క్కు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శంకుస్థాపన
- అమెరికా మిలటరీ క్యాంపుపై రాకెట్ల దాడి
- 50 కోట్ల క్లబ్బులో ఉప్పెన
- ఆయనను ప్రజలు తిరస్కరించారు : మంత్రి హరీశ్రావు
- సీఎం అల్లుడు, మరో ఇద్దరికి జ్యుడీషియల్ రిమాండ్
- భారీ ఆఫర్కు నో చెప్పిన వరంగల్ హీరోయిన్..!