ముంబై: నిర్ణయాక మూడో వన్డేలో ఇంగ్లాండ్ను 7 పరుగుల తేడాతో ఓడించిన టీమ్ఇండియా వన్దే సిరీస్ను 2-1తో సొంతం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన చివరి వన్డేలో గెలుపు కోసం ఇరుజట్లు హోరాహోరీగా పోరాడాయి. సిరీస్ చేజార్చుకున్నప్పటికీ ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లాండ్ ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ సూపర్ లీగ్లో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. ఇయాన్ మోర్గాన్ సారథ్యంలోని ఇంగ్లీష్ జట్టు 40 పాయింట్లతో పాయింట్ల పట్టికలో టాప్లో ఉంది.
రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా(6 మ్యాచ్ల్లో 4గెలుపు, 2ఓటమి) ఖాతాలో కూడా 40 పాయింట్లు ఉన్నప్పటికీ నెట్రన్రేట్లో ఇంగ్లాండ్(9 మ్యాచ్ల్లో 4గెలుపు, 5ఓటమి) కన్నా వెనకబడి ఉంది. ఇంగ్లాండ్పై సిరీస్ విజయంతో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని భారత్ 29 పాయింట్లతో ఏడో స్థానానికి ఎగబాకింది. టీమ్ఇండియా 6 మ్యాచ్ల్లో మూడింటిలో గెలుపొందగా..మూడింటిలో ఓడింది.
పాయింట్ల పట్టికలో టాప్-8 స్థానాల్లో చోటు దక్కించుకున్న జట్లు 2023 వరల్డ్ కప్కు అర్హత సాధిస్తాయి. మెగా టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వనుంది. లీగ్కు భారత్ ఆతిథ్యమిస్తున్నందుకు టీమ్ఇండియా నేరుగా టోర్నీకి అర్హత సాధిస్తుంది.
ఐపీఎల్ 2021: స్టన్నింగ్ లుక్లో అర్జున్ టెండూల్కర్
ఇంగ్లాండ్పై సిరీస్ విక్టరీ..రెండో ర్యాంకుకు దూసుకెళ్లిన భారత్
ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన మరో ఆల్రౌండర్: వీడియో