National
- Dec 27, 2020 , 21:23:20
‘నో కరోనా.. కరోనా నో..’ అథవాలే కొత్త నినాదం

న్యూఢిల్లీ: బ్రిటన్ నుంచి కొత్త రకం కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే ‘నో కరోనా.. కరోనా నో’ అంటూ ఆదివారం కొత్త నినాదం ఇచ్చారు. గతంలో తాను ఇచ్చిన ‘గో కరోనా.. కరోనా గో’ నినాదం పని చేసిందని, దేశంలో కరోనా పరిస్థితి మెరుగైందని ఆదివారం తెలిపారు. ప్రస్తుతం బ్రిటన్ నుంచి కొత్త రకం కరోనా వ్యాపిస్తుండటంతో తన తాజా నినాదం ‘నో కరోనా.. కరోనా నో’ కూడా పని చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘ఇంతకు ముందు నేను ‘గో కరోనా, కరోనా గో’ అని నినాదం ఇచ్చాను. ఇప్పుడు కరోనా వెళ్లిపోతోంది. కొత్త కరోనా వైరస్ కోసం నేను ‘నో కరోనా, కరోనా నో’ నినాదాన్ని ఇస్తున్నా’ అని రామ్దాస్ అథవాలే ఏఎన్ఐకి చెప్పారు. కాగా అక్టోబర్ నెలలో ఆయన కరోనా బారిన పడి కోలుకున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.తాజావార్తలు
- రాష్ర్టంలో కరోనా టీకా తీసుకున్న తొలి మహిళ ఈమెనే
- చనిపోయిన పెంపుడు శునకానికి ఎంత గొప్ప సంస్కారం..!
- రష్యా ఎస్-400 మిస్సైల్ కొనుగోళ్లపై అభ్యంతరం
- లాక్డౌన్తో ప్రాణాలను కాపాడుకున్నాం : ప్రధాని మోదీ
- తెలంగాణలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం
- కరోనా ఖతం.. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ ప్రారంభించిన మోదీ
- దేశంలో కొత్తగా 15,158 పాజిటివ్ కేసులు
- రాష్ర్టంలో కొత్తగా 249 కరోనా కేసులు
- రోహిత్ శర్మ ఔట్.. ఇండియా 62-2
- హార్ధిక్ పాండ్యా తండ్రి కన్నుమూత..
MOST READ
TRENDING