నల్లగొండ : నాగార్జున సాగర్ నియోజకవర్గం వెనుకబాటుకు కాంగ్రెస్ నేత జానారెడ్డే కారణమని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. 30 ఏండ్లు మంత్రిగా ఉన్న జానారెడ్డి సాగర్ నియోజకవర్గానికి ఏం చేశారని ఆయన నిలదీశారు.
అనుముల మండలం హజారిగూడేనికి టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఓబిలినేని రాంప్రసాద్, టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశ్వర్లుతోపాటు కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు
టీఆర్ఎస్ నాయకుడు కడారి అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో మంత్రి మహమూద్ అలీ సమక్షంలో సోమవారం టీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి వారికి గులాబీ కండువా కప్పి మాట్లాడారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసే అన్నిపార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు.
నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్తో మాట్లాడి ప్రత్యేక నిధులు కేటాయించేలా చూస్తానని అన్నారు. ‘‘సాగర్ నియోజకవర్గంలో ఎస్పీ, ఎస్టీ, బీసీలతోపాటు ముస్లిం మైనారిటీలు బాగా వెనుకబడి ఉన్నారు.
రోడ్లు, డ్రైనేజీలు దారుణంగా ఉన్నాయి. జానారెడ్డి 35 ఏండ్లు ఇక్కడ నుంచి గెలిచి సమస్యలను పట్టించుకోలేదు. ఇక్కడి సమస్యలను నేనే స్వయంగా సీఎం దృష్టికి తీసుకెళ్తా. సాగర్ నియోజకవర్గ ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారు.
కార్యకర్తలందరూ బాగా కష్ట పడుతున్నారు. అభివృద్ధి జరగాలంటే 56 ఇంచుల ఛాతి అవసరం లేదు.. 6 ఇంచుల హృదయం ఉంటే చాలని సీఎం కేసీఆర్ నిరూపించారు. పెట్రోల్, గ్యాస్ ధరలను పెంచి కేంద్రంలోని బీజేపీ సామాన్యుల నడ్డి విరిచింది.
టీఆర్ఎస్ మన ఇంటి పార్టీ.. మన అందరి పార్టీ. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ను భారీ మెజారిటీతో గెలిపించాలి’’ అని మంత్రి మహమూద్ అలీ ఓటర్లను కోరారు.
టీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో ఎర్రబోయిన గురువయ్య, మోదాల సైదులు, ఎస్కే షబ్బీర్, ఎస్కే అన్వర్, ఓంకార్, వాసు, పొదిల రామలింగయ్య, సైదులు తదితరులున్నాయి. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి