న్యూఢిల్లీ: రక్త దానం కంటే మెరుగైన సేవ ఏదీ లేదని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఢిల్లీలో CISF ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ‘భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకోవడానికి రక్తదానం కంటే మెరుగైన సేవ ఏదీ లేదు. ఇప్పటివరకు దాదాపు 1500 మంది రక్త దానం చేశారు’ అని గులేరియా అన్నారు. ఈ రక్త దాన శిబిరం ఆగస్ట్ 15 వరకు కొనసాగుతుందని చెప్పారు. రక్త దానం కోసం మరింత మంది ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
దేశంలో కరోనా థర్డ్ వేవ్ను నివారించడానికి ప్రజలు కోవిడ్ నిబంధనలను పాటించాలని రణదీప్ గులేరియా సూచించారు. కరోనా టీకాలు తీసుకోవడం, మాస్క్లు ధరించడం ఎంతో ముఖ్యమన్నారు.