అగ్ర కథానాయకుడు, జనసేన అధినేత పవన్కల్యాణ్ కొవిడ్ బారిన పడ్డారు. గత కొద్ది రోజులుగా జ్వరం, ఒళ్లునొప్పులతో పవన్కల్యాణ్ ఇబ్బందిపడుతుండటంతో రెండు రోజుల క్రితం కొవిడ్ పరీక్ష నిర్వహించగా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఆయన చికిత్సపొందుతున్నారు. ఊపిరితిత్తుల్లో కొద్దిగా నిమ్ము చేరడంతో యాంటివైరల్ మందులతో పవన్కల్యాణ్కు వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ప్రజల ముందుకు వస్తానని పవన్కల్యాణ్ తెలిపారు.