బోథ్, ఏఫ్రిల్ 1: బోథ్ మండలాభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖామంత్రి కే తారకరామారావుకు బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ విన్నవించారు. గురువారం ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, టీఎస్డీడీసీ చైర్మన్ లోక భూమారెడ్డితో కలిసి క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిశారు. మొదట కేటీఆర్ చిత్రపటాన్ని అందించారు. మండల సమగ్ర అభివృద్ధి వివరాలు, చిత్రాలతో తయారు చేసిన పుస్తకాన్ని మంత్రికి అందజేశారు. సొనాల పాఠశాలకు ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఎంపీపీ కేటీఆర్ను విన్నవించారు. స్పందించిన మంత్రి వెంటనే నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్లు ఎంపీపీ తెలిపారు. మండలాన్ని అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దాలని మంత్రి సూచించినట్లు ఎంపీపీ పేర్కొన్నారు.
మంత్రి కేటీఆర్ను కలిసిన టీఎస్డీడీసీ చైర్మన్
లోక భూమారెడ్డి సొంత గ్రామం రుయ్యాడికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న దీన్దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తీకరణ్ పురస్కార్ రావడంతోమంత్రి కేటీఆర్ను గురువారం హైదరాబాద్లోని ప్రగతిభవన్లో రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ లోక భూమారెడ్డి, ఎమ్మెల్యే జోగు రామన్న మర్యాద పూర్వకంగా కలిశారు. గ్రా మంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రికి వివరించారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో రుయ్యాడి గ్రామానికి జాతీయ అవార్డు రావడం ఎంతో గర్వకారణమని పాలకవర్గ సభ్యులను మంత్రి కేటీఆర్ అభినందించారు.