లక్నో : ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైతే యూపీలో బీజేపీ అధికారం నిలబెట్టుకోలేదని బీజేపీ భాగస్వామ్య పక్షం నిషాద్ పార్టీ చీఫ్ సంజయ్ కుమార్ నిషాద్ అన్నారు. నిషాద్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పిస్తామని బీజేపీ ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చలేదని మధురలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు.
ఎస్పీ, బీఎస్పీ జట్టు కట్టినా తమ తోడ్పాటుతోనే 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక సీట్లు లభించాయని నిషాద్ అన్నారు. నిషాద్ పార్టీని విస్మరించిన ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు యూపీలో బలహీనపడ్డాయని చెప్పారు.