హైదరాబాద్ : విశాఖ శ్రీశారదా పీఠాధిపతి శ్రీస్వరూపానందేంద్ర స్వామిని తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ జవహర్ రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీటీడీకి సంబంధించిన పలు విషయాలను స్వామివారితో ఆయన చర్చించారు. పలు కీలక అంశాలను జవహర్ రెడ్డి స్వామివారి దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ సందర్భంగా టీటీడీ తరఫున నిర్వహించబోతున్న కళ్యాణమస్తు కార్యక్రమం మారుమూల ప్రాంతానికి చెందిన భక్తులకు సైతం చేరువయ్యేలా చర్యలు తీసుకోవాలని స్వరూపానంద స్వామి సూచించారు. టీటీడీ తరఫున గిరిజన గ్రామాల్లో నిర్మించ తలపెట్టిన ఆలయాలను త్వరగా పూర్తి చేయాలని ఈఓకు చెప్పారు. స్వరూపానంద స్వామి సూచనలపై ఈఓ జవహర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. త్వరలో వాటికి సంబంధించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు