National
- Jan 10, 2021 , 11:55:48
భారత జాలర్లను అరెస్టు చేసిన శ్రీలంక నేవి

చెన్నై : తమ దేశ జలాల్లోకి వచ్చి చేపలు పట్టారనే ఆరోపణలతో శ్రీలంక నావికాదళం తొమ్మిది మంది భారతీయ మత్స్సకారులను అరెస్టు చేసింది. అలాగే ఓ పడవను స్వాధీనం చేసుకుంది. సంఘటనలో చేపలు పట్టే వలలు దెబ్బతిన్నాయని ఇండియన్ కోస్ట్గార్డ్ అధికారులు ఆదివారం తెలిపారు. శనివారం నెదున్తీవు సమీపంలో మత్స్యకారులను అరెస్టు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. జాలర్లందరూ రామేశ్వరానికి చెందిన వారని చెప్పారు.అలాగే మరో సంఘటనలో లక్కన్ నావికాదళ సిబ్బంది శనివారం కచ్చాతీవు సమీపంలో 20 మరపడవల్లోని చేపలు పట్టే వలలను ధ్వంసం చేశారని అధికారులు పేర్కొన్నారు. భారతీయ మత్స్యకారులపై రాళ్లు, సీసాలు కూడా విసిరినట్లు తెలిపారు. మత్స్యకారుల సంఘం ప్రతినిధి సేసురాజా శ్రీలంక నావికాదళ చర్యలను ఖండించారు. పరికరాలకు నష్టం జరగడం మత్స్యకారులకు బాధ కలిగించిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
- నేటి నుంచి తమిళనాడులో రాహుల్ ఎన్నికల ప్రచారం
- రాష్ట్రంలో కొత్తగా 221 కరోనా కేసులు
- 20 లక్షల టీకాలు పంపిన భారత్.. ధన్యవాదాలు చెప్పిన బొల్సనారో
- గడిచిన 24గంటల్లో 14,256 కొవిడ్ కేసులు
- పదవి నుంచి తప్పుకున్న వుహాన్ మేయర్
- జార్ఖండ్ సీఎంను కలవనున్న తేజస్వీ యాదవ్
- తమిళనాడులో దోపిడీ.. హైదరాబాద్లో చిక్కిన దొంగలు
- ట్రంప్ అభిశంసన.. ఫిబ్రవరిలో సేనేట్ విచారణ
- వరుణ్ ధావన్- నటాషా వివాహం.. టైట్ సెక్యూరిటీ ఏర్పాటు
- సరికొత్త రికార్డులకు పెట్రోల్, డీజిల్ ధరలు
MOST READ
TRENDING