బెంగుళూరు: కర్నాటకలో రాత్రి పూట కర్ఫ్యూను కొనసాగించనున్నారు. ఏప్రిల్ 20వ తేదీ వరకు ఏడు జిల్లాలో రాత్రి పూట కర్ఫ్యూ ఉంటుందని సీఎం యడ్యూరప్ప తెలిపారు. ఇవాళ కోవిడ్19 పరిస్థితిపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమర్జెన్సీ మీటింగ్లో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కే సుధాకర్తో పాటు మరింత కొంత మంది అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగాయని, అన్ని వైపుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నామని, 20వ తేదీ వరకు ప్రస్తుత ఆంక్షలు అమలులో ఉంటాయని సీఎం యడ్డీ తెలిపారు. కర్నాటకలో కరోనా పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని, ఇతర రాష్ట్రాలతో పోల్చలేమని, పరిష్కరించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని, కోవిడ్ను నియంత్రించేందుకు సరైన చర్యలు తీసుకుంటామన్నారు.