అహ్మదాబాద్ : గుజరాత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తితో 36 నగరాల్లో అమలవుతున్న నైట్ కర్ఫ్యూను ఈనెల 18 వరకూ పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నైట్ కర్ఫ్యూతో పాటు కొవిడ్-19 నియంత్రణకు పగటి పూట ఈ నగరాల్లో పలు నియంత్రణలను విధించారు. పగటి వేళ నిత్యావసర సరుకులు, కూరగాయలను విక్రయించే షాపులు, వ్యాపార సంస్థలను మాత్రమే అనుమతిస్తారు.
పండ్లు, కూరగాయలు, బేకరీలు, హోటళ్లు, రెస్టారెంట్లలో కేవలం పార్శిల్ సర్వీసులకు అనుమతిస్తారు. అయితే ఈ షాపులు, సంస్థలు కేవలం యాభై శాతం సిబ్బందితోనే పనిచేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లోనూ యాభై శాతం సిబ్బందితోనే నడపాలని గుజరాత్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాసంస్థలు, సినిమాలు, పార్కులు, స్పాలు, సెలూన్లు, జిమ్ లను మూసివేయాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది.