ముంబై: పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన పేలుడు పదార్థాలలో కూడిన వాహనానికి చెందిన మన్సుఖ్ హిరేన్ను ఊపిరాకుండా చేసి హత్య చేసినట్లు ఈ రెండు కేసులు దర్యాప్తు చేస్తున్న ఎన్ఏఐ తెలిపింది. హిరేన్ను థానే క్రీక్లోకి విసిరే ముందు ఆయన నోట్లో పలు చేతిరూమాళ్లు కుక్కారని, ముఖంపైనా మరో గుడ్డను చుట్టారని, దీంతో ఊపిరాడక చనిపోయాడని ఒక అధికారి చెప్పారు. హత్యకు ముందు ప్రతిఘటించేందుకు హిరేన్ ప్రయత్నించారని, ఈ క్రమంలో ఆయన ముఖంపై పలుచోట్ల చర్మం గీసుకుని ఉన్నదని తెలిపారు. పోస్ట్మార్టం రిపోర్టు, ఇతర ఆధారాలను పరిశీలించిన తర్వాతే దీనిపై ఒక స్పష్టత వస్తుందని చెప్పారు. ముఖేష్ అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన పేలుడు పదార్థాలతో కూడిన వాహనం కేసును తనపై వేసుకునేందుకు మన్సుఖ్ హిరేన్ ఒప్పుకోకపోవడంతో అతడ్ని హత్య చేయించాలని పోలీస్ అధికారి సచిన్ వాజే నిర్ణయించినట్లు దర్యాప్తులో తెలిసిందన్నారు.
మరోవైపు హిరేన్ హత్యను దర్యాప్తు చేస్తున్న మహారాష్ట యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) కూడా ఆయనను ఊపిరాడకుండా చేసి చంపినట్లు నిర్ధాయించింది. ఆయన హత్యకు సంబంధించి ఇద్దరిని ఏటీఎస్ అరెస్ట్ చేసింది. మార్చి 5న ముంబ్రా-రెటి-బందర్ రోడ్ వెంబడి ఉన్న క్రీక్ నుంచి హిరేన్ మృతదేహాన్ని ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.