శ్రీనగర్: జమ్మూకశ్మీర్కు చెందిన ఏడుగురు అనుమానిత ఉగ్రవాదులపై జాతీయ దర్యాప్తు సంస్థ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఆ ఉగ్రవాదులు భారత్పై యుద్ధం చేసేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఉన్నాయి. తెహ్రీక్ ఉల్ ముజాయిదిన్ సంస్థకు చెందిన ఆ ఏడుగురిపై పూంచ్లో కేసు నమోదు చేశారు. మరో వైపు ఇవాళ సోఫియాన్లోని హాంజీపురాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆ ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది చనిపోయాడు. తంగ్దార్ సెక్టార్లో జరిగిన మరో ఘటనలో కుప్వారా పోలీసులు చొరబాట్లను అడ్డుకున్నారు. చొరబాటుదారులు వదిలివేసిన ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు.